News April 28, 2024
ఒంగోలులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలులోని గొడుగుపాలెంలో శనివారం వేకువజామున జరిగింది. ఒకటో పట్టణ సీఐ ఎం.లక్ష్మణ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న షేక్ ముస్తాక్ కుమార్తె ఆరిఫా సుల్తానా(19) నగరంలోని రైజ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఇంట్లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News November 8, 2025
భక్త కనకదాస రచనలు అనుసరణీయం: ఎస్పీ

భక్త కనకదాస జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కనక దాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. కనకదాస రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని కుల అసమానతలను రూపుమాపేందుకు కనకదాస చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన రచనలు ప్రజల్లో భక్తి, సమానత్వం, న్యాయం, సత్యం వంటి విలువలను బోధించాయని పేర్కొన్నారు.
News November 8, 2025
ఆ ఐదు సెలవులు రద్దు: ప్రకాశం డీఈవో

సెలవులపై ప్రకాశం డీఈవో ఎ.కిరణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెలతో పాటు వచ్చే మార్చి వరకు ఉన్న అన్ని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో వరుస సెలవులు ఇవ్వడంతో ఈ 5సెలవు రోజుల్లో స్కూళ్లు పనిచేయాలని ఆదేశించారు. ఈనెల రెండో శనివారం, డిసెంబర్ 13, 2026 జనవరి 25, ఫిబ్రవరి 14, మార్చి 14వ తేదీల్లో స్కూళ్లు నిర్వహించాలన్నారు.
News November 8, 2025
జిల్లా స్థాయి పోటీలకు మార్కాపురం విద్యార్థుల ఎంపిక

ప్రకాశం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ అండర్-14 లో మార్కాపురం బాలురు సత్తా చాటారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న వి.మహేష్ 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించారు. ఎం. అజయ్ 400, 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు.


