News March 14, 2025

ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్‌కు చెందిన సంజీవ కుమార్ ఒంగోలు రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న GRPS పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 22, 2025

రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: జేసీ

image

జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. వాటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కందులకు రూ.7,550, శనగలకు రూ.5,650, మినుములకు రూ.7,400 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని రైతులు విక్రయించి, ప్రభుత్వ కనీసం మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.

News March 22, 2025

ప్రకాశం: బెట్టింగ్ వేయకండి.. కాల్ చేయండి

image

ఐపీఎల్ వినోదం ఇవాళ్టి నుంచే మొదలు కానుంది. ఈక్రమంలో బెట్టింగ్ భూతం భయపడుతోంది. ఒంగోలు నగరంతో పాటు మారుమూల పల్లెల్లోని యువతను సైతం బెట్టింగ్‌‌లోకి లాగడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే ఎవరైనా సరే 100, 112 నంబర్లతో పాటు 91211 02266కు కాల్ చేయాలని ఎస్పీ దామోదర్ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ జోలికి వెళ్లకండి.

News March 22, 2025

ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్స్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్పీ

image

క్రికెట్ బెట్టింగుల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రికెట్ బెట్టింగుల నిర్వాహకులు, పందెపు రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. యువత బెట్టింగుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.

error: Content is protected !!