News March 12, 2025

ఒంగోలు: అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

image

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ పురోగతిపై మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేశారు.

Similar News

News March 26, 2025

జగన్‌ను కలిసిన ఆళ్ల సతీమణి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డిని అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వైసీపీ అధినేత జగన్‌ను ఆంజనేయరెడ్డి సతీమణి సుబ్బమ్మ కలిశారు. పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె జగన్ వద్ద వాపోయారు. పార్టీ అండగా ఉంటుందని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు. మాజీ సీఎంను కలిసిన వారిలో బూచేపల్లి ఫ్యామిలీ, చెవిరెడ్డి ఉన్నారు.

News March 26, 2025

ప్రకాశం: పొగాకు గరిష్ట ధర రూ.280

image

ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పొగాకు వేలంలో, క్వింటా గరిష్టంగా రూ.280 ధర పలకగా కనిష్టంగా రూ.260 పలికినట్లు వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే సరాసరి ధర రూ.275 పలికింది. కాకుటూరువారి పాలెం, శివపురం గ్రామాల నుంచి రైతులు 296 బేళ్లు వేలానికి తెచ్చారు. ఇందులో 232 బేళ్లను కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 64 పొగాకు బేళ్లను కొనుగోలు చేయలేదు.

News March 25, 2025

ప్రకాశం: DSC అభ్యర్థులకు GOOD NEWS

image

ప్రకాశం జిల్లాలోని EBC, BC అభ్యర్థులకు మెగా DSC-2025కి ఆన్‌లైన్ ద్వారా, ఉచిత శిక్షణ ఇస్తామని ఏపీ BC స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకురాలు అంజలి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు విద్యార్హత, ఆధార్, టెట్ మార్కుల జిరాక్సులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలన్నారు. అన్నింటితోపాటు 2 పాస్ ఫొటోలను కలిపి ఒంగోలులోని ఏపీ BC స్టడీ సర్కిల్ ఆఫీసులో సమర్పించాలని కోరారు. ధరఖాస్తులు 10వ తేదీనే ప్రారంభం అయినట్లు తెలిపారు.

error: Content is protected !!