News January 10, 2025
ఒంగోలు: ‘అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే చర్యలు’
సంక్రాంతి సందర్భంగా ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఉప రవాణా కమిషనర్ ఆర్.సుశీల హెచ్చరించారు. తన కార్యాలయంలో ప్రైవేటు వాహనాల యజమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. డ్రైవర్, క్లీనర్లు ప్రయాణికులతో గౌరవంగా మెలగాలని సూచించారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. వాహనానికి సంబంధించిన రికార్డులు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.
Similar News
News January 20, 2025
ఖోఖో ప్రపంచ కప్లో ప్రకాశం కుర్రాడి సత్తా
ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
News January 20, 2025
సిమ్లాలో పర్యటించిన పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, ఎంపీ మాగుంట
గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ పర్యటనలో భాగంగా ఆ కమిటీ ఛైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బృందం ఆదివారం సిమ్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులు, వసతులపై స్థానిక ప్రజలతో ఆరా తీశారు. పలు అంశాలపై అధ్యయనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి త్వరలో నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు.
News January 19, 2025
ప్రకాశం: సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా నిర్వహింనున్నట్లు కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు. గత సోమవారం భోగి పండుగ సందర్భంగా “గ్రీవెన్స్ డే” ను తాత్కాలికంగా రద్దు చేశామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారుల కోసం సోమవారం అధికారులు కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.