News March 14, 2025
ఒంగోలు: ఇళ్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్ధిక తోడ్పాటు కల్పిస్తూ అదనపు సాయంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తుంది. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News February 8, 2026
యర్రబాలెం సైనికుడికి సేవా మెడల్

కంభం మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన దర్రె పుల్లయ్య ఆర్మీలో సాహసోపేత సేవలకుగాను సేవా మెడల్ అందుకున్నారు. మద్రాస్ రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్న ఆయన 2024లో నార్త్ గ్లేసియర్లో 200 అడుగుల లోతులో పడిన ఇద్దరు సైనికులను ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ సాహసానికి గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సేవా మెడల్ను అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో శనివారం ఆర్మీ అధికారులు అందజేశారు.
News February 8, 2026
మార్కాపురం జిల్లా రూపురేఖలు మారుస్తాం: MLA

మార్కాపురం జిల్లా సాధించడమే కాకుండా అభివృద్ధి చేసి చూపుతామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ… చెరువును ట్యాంక్ బండ్లా మార్చి అన్నగారి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అల్లూరి పోలేరమ్మ ఆలయం వైపు కలెక్టరేట్ కార్యాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాలలో మార్కాపురం జిల్లా రూపురేఖలు మారుస్తామన్నారు.
News February 7, 2026
ప్రకాశం: పొగాకు బోర్డు అధికారి ట్రాన్స్ఫర్

కొండపి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునీల్ బదిలీ అయ్యారు. ఆయనను కర్ణాటకకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన స్థానంలో గుంటూరులో పనిచేస్తున్న శంకర్ రావును నియమించారు. త్వరలో ఆయన కొండపికి వస్తారు. పాత అధికారి సునీల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో రైతులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ కావడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.


