News March 29, 2024
ఒంగోలు ఎంపీ టిడిపి అభ్యర్థి మాగుంట రాజకీయ నేపథ్యం

ఒంగోలు ఎంపీ టిడిపి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈయన 2014 టిడిపిలో చేరి ఒంగోలు టిడిపి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 టిడిపికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరి 2019 ఒంగోలు ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2024లో ఫిబ్రవరిలో వైసిపి పార్టీకి రాజీనామా చేసి మార్చి 16న 2024న మళ్లీ టిడిపిలో చేరారు. జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి అందరికీ సుపరిచితమే.
Similar News
News February 7, 2026
ప్రకాశం: పొగాకు బోర్డు అధికారి ట్రాన్స్ఫర్

కొండపి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునీల్ బదిలీ అయ్యారు. ఆయనను కర్ణాటకకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన స్థానంలో గుంటూరులో పనిచేస్తున్న శంకర్ రావును నియమించారు. త్వరలో ఆయన కొండపికి వస్తారు. పాత అధికారి సునీల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో రైతులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ కావడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.
News February 7, 2026
మార్కాపురం: కోరిక తీర్చలేదని చంపేశాడు..!

పొదిలి(M) గోగినేనివారిపాలెంలో గత నెల 18న జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. బుల్లెమ్మ(49) భర్త చనిపోగా ఒంటరిగా ఉంటోంది. అదే ఊరికి చెందిన ఏడుకొండలుకు చాలామంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఆయన భార్యకు బుల్లెమ్మ చెప్పింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. బుల్లెమ్మపై పగ పెంచుకున్న ఏడుకొండలు ఆమె ఇంటికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలని అడగ్గా.. ఒప్పుకోలేదు. దీంతో మెడకు తాడు బిగించి చంపేశాడు.
News February 7, 2026
సింగరాయకొండలో ఈ నెల 8న తిరుప్పావడ సేవ

సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 8న ఆదివారం ఉదయం 6:30 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఈ సేవ నిర్వహిస్తామని EO కృష్ణవేణి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె అన్నారు.


