News March 20, 2024
ఒంగోలు: ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి

ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. ఒంగోలులోని కలెక్టర్ పరిపాలనా భవనంలో ఎన్నికల సిబ్బందికి మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పారు. అవసరమైన సామగ్రిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని చెప్పారు.
Similar News
News October 18, 2025
ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా గాంధీ

చీమకుర్తికి చెందిన తెల్లమేకల గాంధీని ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా పార్టీ అధిష్టానం నియమించింది. తనను నమ్మి పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని గాంధీ తెలిపారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తానన్నారు. ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
News October 18, 2025
బాణసంచా విక్రయదారులకు SP సూచన.!

అనుమతి లేకుండా బాణసంచాలను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలను చేశారు. ఈ సందర్భంగా బాణసంచా విక్రయ కేంద్రాల్లో 18ఏళ్లలోపు పిల్లలను పనిలో ఉంచరాదన్నారు.
News October 18, 2025
పెద్దారవీడు: పేకాట ఆడివారికి 2 రోజులు శిక్ష

మండలంంలోని రేగుమానుపల్లి గ్రామ పొలాల్లో పేకాట శిబిరంపై సెప్టెంబర్ ఆరవ తేదీ పోలీసులు దాడి చేశారు. 14 మందిని అదుపులోకి తీసుకొని వారివద్ద ఉన్న రూ.1,09,910లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం 14 మంది ముద్దాయిలకు మార్కాపురం జడ్జి బాలాజీ విచారించి ఒక్కొక్కరికి రూ.300 జరిమానా 2 రోజులు సాధారణ జైలుశిక్ష విధించినట్లు ఎస్సై సాంబశివయ్య తెలిపారు.