News August 27, 2024
ఒంగోలు: ‘ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణ’

ఒంగోలు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30 రోజులపాటు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత అర్హులని, వయస్సు 19- 45 ఉండి రేషన్, ఆధార్ కార్డులు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.
Similar News
News November 6, 2025
మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇలా..!

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి రెవెన్యూ జిల్లాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేలా ప్రతిపాదించారు. మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరును కందుకూరు డివిజన్లోకి మార్చనున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి అద్దంకి డివిజన్గా ఏర్పాటు కానుంది. డిసెంబర్ నెలాఖారు లోపల ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
News November 6, 2025
ఒంగోలులో తొలిసారి షూటింగ్ టోర్నమెంట్.!

ప్రకాశం జిల్లాకు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి షూటింగ్ టోర్నమెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈనెల 7, 8, 9న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 700మంది క్రీడాకారులు తరలి వస్తారని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. టోర్నీ గురించి కలెక్టర్ రాజాబాబుతో డీఈఓ బుధవారం చర్చించారు.
News November 6, 2025
వెలుగొండ ప్రాజెక్ట్కు రానున్న మంత్రి నిమ్మల

నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు,రేపు దోర్నాలలో పర్యటించనున్నారు. నేటి రాత్రికి ఆయన దోర్నాలకు చేరుకుంటారు. రేపు ఉదయం కొత్తూరు వద్ద బ్రీచ్ అయిన తీగలేరు వాగును పరిశీలిస్తారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ సందర్శిస్తారు. ఇటీవల ‘మొంథా’ తుఫాను ప్రభావంతో ప్రాజెక్టులోకి నీరు చేరిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.


