News September 19, 2024
ఒంగోలు: కంప్యూటర్, ట్యాలీపై ఉచిత శిక్షణ
ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కంప్యూటర్, ట్యాలీ నందు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలు కలిగి ఉండి, గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ మహిళలకు ఈ అవకాశం ఉంటుందన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలని, శిక్షణ సమయంలో శిక్షణతో పాటు భోజన, వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 20, 2024
నేడు జగన్ను కలవనున్న MLA తాటిపర్తి
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శుక్రవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడిన నేపథ్యంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి కూడా పార్టీని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేకు పిలుపొచ్చింది. దీంతో ఆయన ఇవాళ జగన్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
News September 20, 2024
ప్రకాశం జిల్లాలో నేడు CM పర్యటన
ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం మద్దిరాలపాడులో నేడు CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పాలన పూర్తయిన సందర్భంగా.. ఇది మంచి ప్రభుత్వం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్యం 2 గంటలకు మద్దిపాడు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు మీటింగ్లో పాల్గొంటారు. అధికారులు పర్యటనా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News September 19, 2024
ఒంగోలు: వారంతా ఒక్కటయ్యారు.. ఫొటో వైరల్
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణను సైతం బాలినేని కలిశారు. ఈ కలయికతో జనసేనలో బాలినేని చేరికకు రియాజ్ అడ్డు తగులుతున్నారన్న వివాదానికి తెర పడింది. మొత్తం మీద వీరి కలయిక ఫొటో వైరల్గా మారింది.