News April 24, 2024
ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈదా నామినేషన్

ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నియోజవర్గ ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు.
Similar News
News October 18, 2025
పెద్దారవీడు: పేకాట ఆడివారికి 2 రోజులు శిక్ష

మండలంంలోని రేగుమానుపల్లి గ్రామ పొలాల్లో పేకాట శిబిరంపై సెప్టెంబర్ ఆరవ తేదీ పోలీసులు దాడి చేశారు. 14 మందిని అదుపులోకి తీసుకొని వారివద్ద ఉన్న రూ.1,09,910లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం 14 మంది ముద్దాయిలకు మార్కాపురం జడ్జి బాలాజీ విచారించి ఒక్కొక్కరికి రూ.300 జరిమానా 2 రోజులు సాధారణ జైలుశిక్ష విధించినట్లు ఎస్సై సాంబశివయ్య తెలిపారు.
News October 18, 2025
ప్రకాశం: ‘15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం’

ప్రకాశం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్కు గాను రూ.15వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో జేసీ సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే అవసరమగు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
News October 17, 2025
దేశ అభివృద్ధికి యువతే వెన్నెముక: కలెక్టర్

భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముకని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. యువత దేశ ఉన్నతికి పాటుపడాలన్నారు.