News December 29, 2024

ఒంగోలు: జిల్లాలో వార్షిక నేర నివేదికను విడుదల 

image

జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో 440 దొంగతనాలు జరిగాయని, 581 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన వార్షిక నేర నివేదికను ఆదివారం విడుదల చేశారు. గత ఆరు నెలల్లో రూ.1.7 కోట్లు చోరీ కాగా రూ. 1.4 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. రానున్న కొత్త ఏడాది జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు కొత్త పోలీసింగ్‌కు శ్రీకారం చుడతామన్నారు.

Similar News

News January 6, 2026

ప్రకాశం, మార్కాపురం జిల్లాలు.. అసలు రూపం ఇదే!

image

ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి భౌగోళిక స్వరూపాన్ని అధికారులు రూపొందించారు. ప్రకాశం జిల్లా 28 మండలాలు, 520 గ్రామాలతో ఉండగా.. మార్కాపురం జిల్లా 21 మండలాలతో 508 గ్రామాలతో స్వరూపాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇక విస్తీర్ణం విషయంలో ప్రకాశం జిల్లా 15,58,828.77 ఎకరాలు, మార్కాపురం 14,82,757.24 ఎకరాలు ఉంది.

News January 5, 2026

కనిగిరి: మహిళను హత్య చేసి.. ప్రియుడి సూసైడ్

image

వెలిగండ్ల(M) కట్టకిందపల్లిలో సోమవారం వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. DSP సాయి ఈశ్వర్ వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన సీనావలి కట్టకిందపల్లికి చెందిన నాగజ్యోతికి వివాహేతర సంబంధం ఉండగా సోమవారం సీనావలి ఆమెతో <<18769740>>గొడవపడి హత్య<<>> చేశాడు. గ్రామస్థులకు బయపడి సీనావలి కూడా విష ద్రావణం తాగడంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News January 5, 2026

కనిగిరి వద్ద మహిళ దారుణ హత్య.!

image

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో సోమవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టామని మరన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని SI కృష్ణ పావని తెలిపారు. హత్యకు గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.