News December 29, 2024

ఒంగోలు: జిల్లాలో వార్షిక నేర నివేదికను విడుదల 

image

జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో 440 దొంగతనాలు జరిగాయని, 581 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన వార్షిక నేర నివేదికను ఆదివారం విడుదల చేశారు. గత ఆరు నెలల్లో రూ.1.7 కోట్లు చోరీ కాగా రూ. 1.4 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. రానున్న కొత్త ఏడాది జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు కొత్త పోలీసింగ్‌కు శ్రీకారం చుడతామన్నారు.

Similar News

News January 19, 2025

ప్రకాశం: సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా నిర్వహింనున్నట్లు కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు. గత సోమవారం భోగి పండుగ సందర్భంగా “గ్రీవెన్స్ డే” ను తాత్కాలికంగా రద్దు చేశామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారుల కోసం సోమవారం అధికారులు కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.

News January 19, 2025

ప్రకాశం: నడుస్తూనే మృత్యు ఒడిలోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు

image

రోడ్డుపై తమ పనుల నిమిత్తం కాలిబాట పట్టిన ముగ్గురు వ్యక్తులు మృత్యు ఒడిలోకి జారుకున్నారు. మార్టూరు మండలం ఇసుక దర్శి గ్రామ సమీపంలో నాగిరెడ్డి నడుస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలో ప్రసన్నకుమార్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. కొనకనమిట్ల మండలం చౌటపల్లి వద్ద నాగయ్యను ట్రాలీ ఆటో ఢీ కొనడంతో మృతి చెందాడు.

News January 19, 2025

పాకలలో నలుగురు మృతి.. అసలు కారణం ఇదే.!

image

పాకల బీచ్‌లో 2 రోజుల క్రితం సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. పాకల బీచ్‌లో ఉన్న చిన్నచిన్న గుంతల కారణంగా కడ్సలు (సుడిగుండాలు) ఏర్పడుతాయని, వీటిలో చిక్కుకున్న వారు బ్రతకడం కష్టమని మత్స్యకారులు తెలిపారు. శివన్నపాలెం గ్రామానికి చెందిన నవ్య సమయస్ఫూర్తితో వ్యవహరించి కడ్సల బారి నుంచి తప్పించుకుందని వారు తెలిపారు.