News May 26, 2024
ఒంగోలు: టీడీపీ నేత కారు దగ్ధం.. నిందితులు అరెస్ట్

సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడులో టీడీపీ నాయకుడు చిగురుపాటి శేషగిరిరావుకు చెందిన కారు దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. ఒంగోలులోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితులు కనసాని ఈశ్వర్ రెడ్డి, పాలెటి అభిషేక్, గోపాలుడని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 6, 2025
ప్రకాశం జిల్లాలో 213 వాహనాలకు జరిమానా

ప్రకాశం వ్యాప్తంగా బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2,044 వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 213 వాహనాలను గుర్తించి రూ.1.56లక్షల జరిమానా విధించారు. డ్రైవింగ్పై పూర్తి దృష్టి కేంద్రీకరించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు.
News November 6, 2025
అధికారులకు ప్రకాశం కలెక్టర్ సూచనలు

లోప రహిత ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఇప్పటినుంచే దృష్టిసారించాలని ప్రకాశం కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఈఆర్వోలను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఒంగోలు నుంచి కలెక్టర్ హాజరయ్యారు.
News November 6, 2025
ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


