News May 4, 2024

ఒంగోలు: టెన్త్ మార్కుల జాబితాలు సిద్ధం

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పొట్టి మార్కుల జాబితాను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్సైట్ లో సిద్ధంగా ఉన్నట్లుగా డీఈఓ సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వెబ్‌సైట్ నుంచి మార్కుల జాబితాలు డౌన్‌లోడ్ చేసి ప్రధానోపాధ్యాయులు అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. ఈ మార్కులు జాబితాలతో విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందవచ్చన్నారు.

Similar News

News December 10, 2025

ప్రకాశం వాసులకు CM గుడ్ న్యూస్.!

image

ప్రకాశం జిల్లాకు సంబంధించి CM కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలు సాగుచేసే రైతన్నలకు శుభవార్తగా చెప్పవచ్చు. ఉద్యానపంటలపై సమీక్షించిన సీఎం, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులను పూర్తి చేయడం ద్వారా పంటలకు నీరు అందించవచ్చని అధికారులకు సూచించారు. పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొత్తగా 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు.

News December 10, 2025

చీమకుర్తిలో పిల్లలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

చీమకుర్తిలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ రాజాబాబు, MLA విజయ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు శివాజీ, ఎల్వీ నరసింహారావు, మండల టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

News December 10, 2025

ప్రకాశం జిల్లాలో 2కు చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

image

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది. వారం రోజుల వ్యవధిలో స్క్రబ్ టైఫస్‌తో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గతంలో ఇదే వ్యాధి లక్షణాలతో ఎర్రగొండపాలెం మండలంలో ఓ మహిళ మృతి చెందగా.. తాజాగా సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన మహిళ మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. అయితే స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అవసరం లేదని.. అవగాహన అవసరమని అధికారులు సూచిస్తున్నారు.