News February 16, 2025
ఒంగోలు: ‘దివ్యాంగుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి’

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు 60 మంది దివ్యాంగులు వారి సమస్యలపై అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. సత్వరమే ఈ అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
Similar News
News March 12, 2025
ఒంగోలు: అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ పురోగతిపై మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేశారు.
News March 12, 2025
SOSకు కాల్ చేసిన ప్రకాశం ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్లో అత్యవసర సేవలు అందిస్తున్న శక్తి యాప్ పనితీరు గురించి ఆరా తీశారు. ఎస్పీ స్వయంగా తన ఫోన్ నుంచి SOSకు కాల్ చేసి సిబ్బంది ఎలా స్పందిస్తున్నారని పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే అన్ని కాల్స్కు రెస్పాండ్ కావాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు.
News March 12, 2025
గిద్దలూరు: రైలు ఎక్కి కరెంటు వైర్ పట్టుకున్న యువకుడు

గిద్దలూరులోని స్థానిక రైల్వే స్టేషన్లో బుధవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కాడు. అనంతరం పైన ఉన్న హై వోల్టేజ్ కరెంట్ వైర్ను పట్టుకున్నాడు. దీంతో షాక్ తగిలి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.