News February 16, 2025

ఒంగోలు: ‘దివ్యాంగుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి’

image

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు 60 మంది దివ్యాంగులు వారి సమస్యలపై అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. సత్వరమే ఈ అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

Similar News

News March 27, 2025

ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించండి: మంత్రి స్వామి

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండపి ఎంపీడీఓ సమావేశ హాల్‌లో నియోజక వర్గ పరిధిలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.

News March 27, 2025

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ఒంగోలులోని భాగ్యనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించాలి. కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News March 27, 2025

ఒంగోలులో ఇఫ్తార్ విందు కార్యక్రమం

image

ఒంగోలులో జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘంశాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని గోపాలస్వామి కళ్యాణమండపంలో గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మంత్రి స్వామి, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే విజయకుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

error: Content is protected !!