News July 25, 2024

ఒంగోలు: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న రెండు న్యాయ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి గురువారం విడుదల చేశారు. ఆయా కళాశాలల నుంచి మూడు సంవత్సరాల లా కోర్సులో 69.7 శాతం ఉత్తీర్ణతతో 223 మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాల లా కోర్సులో 62.5 శాతంతో ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు.

Similar News

News November 24, 2025

అర్జీల ఆన్లైన్‌లో నమోదు చేయాలి: ప్రకాశం కలెక్టర్

image

ఒంగోలు కలెక్టర్ రాజాబాబు కలెక్టర్ మీకోసం అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ మీకోసం అనంతరం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ‘ప్రతి అర్జీదారుడుతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలిగి వారి సమస్యను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలన్నారు. ప్రతిరోజు IVRS కాల్ ద్వారా అర్జీదారులతో మాట్లాడడం జరుగుతుంది’ అని అన్నారు.

News November 24, 2025

ఒంగోలు: విచారణకు తీసుకొస్తే.. పారిపోయారు?

image

ఒంగోలులో పోలీసుల విచారణకు వచ్చిన ఇద్దరు అనుమానితులు పోలీస్ స్టేషన్ నుంచి పరారైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు ఒంగోలుకు చెందిన ఇద్దరు అనుమానితులను తీసుకువచ్చి చోరీలపై పోలీసులు విచారించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి ఆ ఇద్దరు పరారైనట్లు సమాచారం. దీనితో పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News November 24, 2025

ఒంగోలు: క్రికెట్ తెచ్చిన కుంపటి.. 12 మందిపై కేసు నమోదు!

image

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డులో క్రికెట్ కారణంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువురి ఫిర్యాదు మేరకు 12 మంది పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. ఆదివారం మంగమూరు రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న రెండు బ్యాచ్‌లలో విభేదాలు తలెత్తి ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. దీంతో రెండు జట్లకు చెందిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.