News March 1, 2025

ఒంగోలు: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

image

ఒంగోలు నగరంలోని 49వ డివిజన్‌లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ఆదిలక్ష్మి, ఆర్డీవో కె. లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News December 2, 2025

ఒంగోలు:17 ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు నోటీసులు

image

జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. అలాంటి 17 పాఠశాలల యాజమాన్యాలకు డీఈవో కిరణ్ కుమార్ తుది సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. వీటిలో 14 స్కూళ్లలో 40 మందిలోపు, మూడు స్కూళ్లలో 20 మందిలోపు విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం 2సార్లు నోటీసులు జారీచేసినా స్కూల్ యాజమాన్యాలు స్పందన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 2, 2025

ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.

News December 2, 2025

ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.