News February 22, 2025

ఒంగోలు: పెళ్లిలో భోజనాల వద్ద గొడవ

image

పెళ్లిలో భోజనాల గొడవ గాలివానలా పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఒంగోలులోని ఓ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి పెళ్లి జరిగింది. అందులో జిలానీ భోజనాలు వడ్డిస్తుండగా, తమకు సరిగా మర్యాద చేయలేదని అన్వర్, నజీర్, సూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతటితో వివాదం ముగిసిందనగా, విందు ముగిసిన తరువాత జిలానీపై ముగ్గురు దాడి చేశారు. జిలానీ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News February 23, 2025

కొండపి: సొంత చెల్లినే గర్భవతి చేసిన అన్న

image

మానవ సంబంధాలను మంట గలిపే దారుణ ఘటన కొండపి మండలంలో వెలుగు చూసింది. విజయవాడలోని తల్లి వద్ద ఉంటున్న పెద్ద చెల్లిని, అన్న గతేడాది క్రిస్మస్‌కు పెట్లూరుకు తీసుకొచ్చాడు. పండగ అనంతరం చెల్లిని విజయవాడలో వదిలిపెట్టకుండా తన వెంట హైదరాబాద్ తీసుకువెళ్లాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో తల్లి వద్దకు చేరుకున్న కుమార్తెకు వైద్య పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది. విషయం తల్లికి చెప్పడంతో కేసు పెట్టింది.

News February 23, 2025

ప్రకాశం: ‘ఫేక్ డాక్యుమెంట్స్ సేకరించాలి’

image

ఒంగోలు, పరిసర ప్రాంతాలలో నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో రెండేళ్ళ క్రితం వెలుగుచూసిన భూ అక్రమాలపై.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోడియా అరా తీశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో ప్రకాశం భవనంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు సృష్టించారో ఆధారాలను సేకరించాలని ఆదేశించారు.

News February 22, 2025

ప్రకాశం: ‘సెలవుల్లో కూడా బిల్లులు కట్టవచ్చు’

image

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకొనే కేంద్రాలు 23వ తేదీ ఆదివారం పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజు అయినా ఆదివారం కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెల ఆఖరు అయినా బిల్లులు చెల్లించలేదని విచారం వ్యక్తం చేశారు.

error: Content is protected !!