News July 7, 2024
ఒంగోలు: 11న ఐటీఐ విద్యార్థులకు జాబ్ మేళా

ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బాలికల ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ పి.ఉమామహేశ్వరిదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ చదువుతున్న, పాసైన అభ్యర్థులను ఉద్యోగం లేదా అప్రంటీస్ శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ భృతి చెల్లిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News October 27, 2025
ప్రకాశం అధికారులను అలర్ట్ చేసిన సీఎం

మొంథా తుఫాన్ నేపథ్యంలో సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం గురించి, రెవెన్యూ సిబ్బంది తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ , ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు.
News October 27, 2025
శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే?

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉండనున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు సీఎంకు నివేదిక పంపనుంది. అయితే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. మార్కాపురం-శ్రీశైలం 81KM, నంద్యాల-శ్రీశైలం 160KM. మార్కాపురానికి దగ్గరగా ఉందన్న కారణంతోనే కొందరు శ్రీశైలాన్ని ఆ జిల్లాలో కలపాలనే వినతులు సమర్పించారట.
News October 27, 2025
తుఫాన్ హెచ్చరిక.. మండలాలకు ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం!

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముందస్తు చర్యలలో భాగంగా తీర ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను ఆదివారం నియమించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయంలో ఇప్పటికే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయగా తీర ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు పోలీస్ అధికారులను నియమించారు.


