News April 7, 2024

ఒంగోలు: 59 ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు

image

ఒంగోలు నగరంలోని కేంద్రియ విద్యాలయంలో ఈ నెల 5న సార్వత్రిక ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు జిల్లాలోని పీవోలు, ఏపీవోలకు తొలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే పలువురు అధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరు కాలేదు. విషయం కలెక్టర్ దినేశ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో జిల్లాలోని 59 మంది పీవోలు, ఏపీవోలకు కలెక్టర్ శనివారం సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.

Similar News

News November 15, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.

News November 14, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.

News November 14, 2025

ప్రకాశం: వచ్చేనెల ఒకటి నుంచి సీజనల్ హాస్టళ్లు ప్రారంభం.!

image

ప్రకాశం జిల్లాలో వలసదారుల పిల్లల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సీజనల్ హాస్టల్‌లను వచ్చేనెల 1 నుంచి ప్రారంభించనున్నట్లు DEO కిరణ్‌కుమార్ వెల్లడించారు. సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం, గుంతచెన్నంపల్లి, చీమకుర్తి మండలం పినాయుడుపాలెం, గిద్దలూరు మండలం త్రిపురవరం, కొంగలవీడు, తర్లుపాడు నాజెండ్లముడుపులలో హాస్టల్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి నిర్వహణకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.