News July 28, 2024
ఒంగోలు: ‘APPSC పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

APPSC ఆధ్వర్యంలో నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్వో విశ్వేశ్వరరావు చెప్పారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు డిపార్ట్మెంట్ పరీక్షలు జిల్లాలోని 4 కేంద్రాలలో జరుగనున్నాయి. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాశం భవనంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం జరిగింది.
Similar News
News November 24, 2025
ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.
News November 24, 2025
ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.
News November 24, 2025
అర్జీల ఆన్లైన్లో నమోదు చేయాలి: ప్రకాశం కలెక్టర్

ఒంగోలు కలెక్టర్ రాజాబాబు కలెక్టర్ మీకోసం అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ మీకోసం అనంతరం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ‘ప్రతి అర్జీదారుడుతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలిగి వారి సమస్యను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలన్నారు. ప్రతిరోజు IVRS కాల్ ద్వారా అర్జీదారులతో మాట్లాడడం జరుగుతుంది’ అని అన్నారు.


