News April 18, 2024
ఒంగోలు: ATM వ్యాన్ లో రూ.65 లక్షల నగదు చోరీ

ఒంగోలులో ATM కేంద్రాలకు నగదు తరలించే వాహనంలో రూ.65 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సీఎంఎస్ ఏజెన్సీకి సంబంధించిన వాహన సిబ్బంది భోజనం కోసం కర్నూలు రోడ్డులో వాహనాన్ని నిలుపుదల చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనం తాళం పగలగొట్టి నగదు చోరీ చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఏఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 23, 2025
FLASH: ఒంగోలు మాజీ MLAకు గుండెపోటు

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ MPP ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ MLA ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి మేనల్లుడు అవుతాడు. అల్లుడి మృతి వార్తతో హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి తదితరులు హరిబాబును పరామర్శించారు.
News April 23, 2025
ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.