News April 9, 2025
ఒంటిమిట్టకు సీఎం.. షెడ్యూల్ ఇదే.!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 11 న కడప జిల్లా పర్యటనకు రానున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 11వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకుంటారు. అనంతరం రామయ్యను దర్శించుకుని, కళ్యాణ వేడుకలో స్వామి వారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు అందజేస్తారు. రాత్రికి ఒంటిమిట్ట గెస్ట్ హౌస్లో బస చేస్తారు.
Similar News
News December 8, 2025
ప్రమాదాల నివారణకు SP చర్యలు.. 9 టీమ్లు రెడీ!

బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో పోలీసులు, నేషనల్ హైవే, మోటార్ వెహికల్ సిబ్బంది, వాలంటీర్లు ఉంటారు. ఈ బృందాలకు డీపీఓలో శిక్షణ ఇచ్చారు. పెనుమూడి, చీరాల, మేదరమెట్ల వంటి కీలక ప్రాంతాలలో ఈ బృందాలు పనిచేస్తాయని ఎస్పీ తెలిపారు.
News December 8, 2025
ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితం: కలెక్టర్

ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితంగా ఇవ్వాలని, గోనె సంచులు తెచ్చుకున్న వారికి అధికారులే నగదు చెల్లించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ధాన్యం విక్రయించడానికి రైతులే స్వయంగా గోనె సంచులు తెచ్చుకుంటే ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 8, 2025
సంగారెడ్డి: ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినిగించుకోవాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొదటి విడత ఎన్నికలు జరిగే సంగారెడ్డి, కంది, సదాశివపేట, గుమ్మడిదల, కొండాపూర్, పటాన్ చెరు, హత్నూర ఎంపీడీవో కార్యాలయాల్లో ఈనెల 9లోపు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని చెప్పారు.


