News May 25, 2024

ఒంటిమిట్టలో హరిత శోభకు TTD ప్రణాళిక

image

ఒంటిమిట్టలో హరిత శోభ కోసం TTD అధికారులు ప్రణాళిక రూపొందించారు. కోదండ రామాలయం పరిసర ప్రాంతాలు, కాలిబాటలు, సీతారాముల కళ్యాణ వేదిక, శృంగిశైలం, నాగేటి తిప్పపై పచ్చదనం పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం DFO శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివప్రసాద్, హరికృష్ణల ఆధ్వర్యంలో అధికారుల బృంద సభ్యులు ఇక్కడికి వచ్చారు. నీడ, ఆహ్లాదం పెంచే మొక్కలు నాటి సంరక్షించాలని చర్చించారు.

Similar News

News March 14, 2026

కడప: 2 వారాల గడువు..రూ.97 కోట్లే లక్ష్యం.!

image

జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.97.17 కోట్లు పేరుకు పోయాయి. 2 వారాల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పన్ను వసూళ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల వారీగా బకాయిలు ఇలా (రూ.కోట్లలో) ఉన్నాయి. *KDP – రూ.62.93 *PDTR – రూ.20.14 *PLVD – రూ.4.58 *జమ్మలమడుగు – రూ.2.49
*ఎర్రగుంట్ల – రూ.3.20 *మైదుకూరు – రూ.3.09 *కమలాపురం – రూ.0.74కోట్లు.

News March 14, 2026

అదనపు ఛార్జీలు తీసుకుంటే చర్యలు: RDO

image

జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజన్ అధికారి భవన అన్నారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. LPG పంపిణి సంస్థలు తప్పనిసరిగా స్టాక్ బోర్డును ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్ సరఫరా చేయాలన్నారు. అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.

News March 14, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ సివిక్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేడు 3,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 3,397 మంది మాత్రమే హాజరయ్యారు. 326 మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు.