News April 14, 2025

ఒంటిమిట్టలో 41.4 °c ఉష్ణోగ్రత నమోదు..

image

కడప జిల్లా ఒంటిమిట్టలో ఆదివారం అత్యధికంగా 41.6°c డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన ఎండ శాతం వివరాలను ప్రకటించగా ఇందులో కడప జిల్లాలో ఒంటిమిట్టలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైనట్లు అందులో పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవి కాలం దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News April 19, 2025

కడపలో పోలీసుల శ్రమదానం

image

నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే పోలీసులు చీపుర చేతబట్టి చెత్త  ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

News April 19, 2025

కడప: వచ్చి మీ ఫోన్ తీసుకెళ్లండి…!

image

కడపలో చాలా మంది తమ ఫోన్లు పొగొట్టుకున్నారు. పోలీసులు ఎంతోకష్టపడి 602 ఫోన్లు రికవరీ చేశారు. ఇందులో 275 మంది తమ మొబైల్స్ తీసుకెళ్లారు. ఇంకా 327 ఫోన్లు పోలీసుల దగ్గరే ఉన్నాయి. సరైన ఆధారాలు చూపింది వీటిని తీసుకెళ్లాలని కడప సైబర్ క్రైం పోలీసులు కోరారు. మరిన్ని వివరాలకు 08562 245490 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News April 19, 2025

ఘోర ప్రమాదం.. కడప ప్రయాణికులు సేఫ్

image

కడప ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి దాదాపు 20మందితో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కడప నుంచి బయల్దేరింది. గద్వాల(D) ఇటిక్యాల(M) మండలంలోని ప్రియదర్శి హోటల్ వద్ద హైదరాబాద్ నుంచి నంద్యాల వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి కడప బస్సు పైకి దూసుకొచ్చింది. కారులోని ఇద్దరు చనిపోగా.. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్యామేజ్ కావడంతో కడప ప్రయాణికులను మరో వాహనంలో HYD తరలించారు.

error: Content is protected !!