News April 11, 2025

ఒంటిమిట్ట రామదాసు ఈయనే..

image

భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మించి రామదాసు చరిత్రలో నిలిచిపోయారు. ఒంటిమిట్ట రామాలయానికి ఆ స్థాయిలోనే కృషి చేశారు వావిలికొలను సుబ్బారావు. 1863 జనవరి 23న ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం టెంకాయ చిప్ప చేత పట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఊరూరా తిరిగారు. భిక్షంగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. 1936, ఆగస్టు 1న మద్రాసులో కన్నుమూశారు.

Similar News

News November 20, 2025

చలికాలం స్నానం చేయడం లేదా?

image

చలి విపరీతంగా పెరగడంతో చాలామంది స్నానం చేసేందుకు ఇష్టపడరు. ఎంత వేడినీటితో షవర్ చేసినా తర్వాత చలివేస్తుందంటూ స్నానానికి దూరంగా ఉంటున్నారు. కొందరైతే రోజుల తరబడి స్నానం చేయడంలేదు. అయితే ఇది మంచిది కాదంటున్నారు వైద్యులు. స్నానం చేయకపోతే శరీరంపై చెమట పేరుకుపోయి అలర్జీలకు దారి తీస్తుందట. అలాగే చర్మం నుంచి దుర్వాసన వచ్చి ఇతరుల దృష్టిలో చులకన అవుతారు. నిత్యం తప్పనిసరిగా స్నానం చేయాలి.

News November 20, 2025

మహబూబ్ నగర్: ఎస్పీ కీలక ఆదేశాలు జారీ

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. రోడ్లపై ధాన్యం మారపోసి ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా, ధాన్యంపై నల్లని కవర్లు కప్పడం వాటిపై రాళ్లని పెట్టడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు ముందున్న అడ్డంకి గుర్తించలేక, భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

News November 20, 2025

మల్లవరం పంచాయతీకి రాష్ట్రంలో ద్వితీయ స్థానం

image

శానిటేషన్ IVRS కాలింగ్‌లో చాగల్లు మండలం మల్లవరం పంచాయతీ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎంపీడీవో శ్రీదేవి గురువారం ప్రకటించారు. పబ్లిక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో, ఇంటింటికీ చెత్త సేకరణకు 100 శాతం, కనీసం వారానికి రెండుసార్లు సేకరణకు 92 శాతం మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కమలావతిని ఎంపీడీవో సన్మానించారు.