News March 31, 2025

ఒంటిమెట్ట రాములోరికి నంద్యాల తళంబ్రాలు సిద్ధం

image

ఒంటిమిట్ట శ్రీ రాములవారి కళ్యాణం కోసం భక్తులు వడ్లను గోటితో ఒలిచిన తళంబ్రాలను నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీ కోదండ రామస్వామి సమక్షంలో పూజ చేశారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వడ్లను భక్తులు రామాలయంలో గోటితోనే ఒలుస్తారని తెలిపారు. ఆ తళంబ్రాలను కళ్యాణం సమయంలో రాముల వారి చెంతకు చేరుస్తారని అర్చకులు తెలిపారు.

Similar News

News October 19, 2025

వనపర్తి జిల్లా నుంచి 73 లైసెన్స్ సర్వేయర్లు ఎంపిక

image

వనపర్తి జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు లైసెన్స్ పంపిణీని కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా నుంచి 73 మంది లైసెన్స్ సర్వేయర్లు హైదరాబాద్ బయలు దేరారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా HYD శిల్పకళా మాదాపూర్‌లో సర్వేయర్లకు లైన్స్‌ల పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర మొత్తం 3,465 మంది లైసెన్స్ సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేయనున్నారు.

News October 19, 2025

విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

image

విజయవాడలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పున్నమి ఘాట్ వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగే దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయం తెలియజేసింది. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పున్నమి ఘాట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

News October 19, 2025

అల్లూరి: వర్షంతో టపాసుల విక్రయాలకు అవస్థలు

image

అల్లూరి జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. ఇప్పటికే పాడేరు, అరకు, రంపచోడవరం, రాజవొమ్మంగి తదితర ప్రాంతాల్లో టపాసుల దుకాణలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈక్రమంలో టపాసులు తడిచిపోకుండా కాపాడుకోవడానికి వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు వర్షాల కారణంగా టపాసులు సరిగా పేలుతాయో లేదోనని కొందరు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో కొన్ని చోట్ల విక్రయాలు నెమ్మదించాయి.