News March 17, 2025
ఒకే రోజు 46 వివాహాలకు హాజరైన ఎర్రబెల్లి

ఓకే రోజు 46 వివాహాలకు హాజరై ఎర్రబెల్లి దయాకర్ రావు రికార్డు సృష్టించారు. సాధారణంగా నాయకులు అంటే ఒకటి, రెండు వివాహాలకు హాజరవుతారు కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఒక్క రోజే దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర, వర్ధన్నపేట మండలాల్లో పర్యటించి 46 నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులకు సంతోషకరమైన వైవాహిక జీవితం కోరుతూ వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలన్నారు.
Similar News
News March 17, 2025
పార్వతీపురం: నేడు పీజీఆర్ఎస్కు 13 వినతులు

పార్వతీపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 13 వినతులు వచ్చినట్లు ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి తెలిపారు. ప్రజలు దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలను తెలిపేందుకు వస్తున్నారని చెప్పారు. వారి సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, వాటి నివేదికను ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు.
News March 17, 2025
తిరుమల:తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది.మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయించనున్నట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణా సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించనున్నట్లు తెలిపారు. బుధ,గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించనున్నట్లు ‘X’ వేదికగా టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
News March 17, 2025
JNTUA 14వ స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ విడుదల

అనంతపురం జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి 2023-24 మధ్య కాలంలో యూజీ (లేదా) పీజీ (లేదా) పీహెచ్డీ పూర్తి చేసుకున్నవారు తమ ఒరిజినల్ డిగ్రీలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు https://jntuaebranchpayment.in/originaldegree/ ను సందర్శించాలని సూచించారు.