News December 23, 2024
ఒక్క గ్యారెంటీ అమలు చేయని కాంగ్రెస్: హరీశ్ రావు

బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో రూ. 4లక్షల 17వేల కోట్ల అప్పుచేస్తే.. రేవంత్ రెడ్డి కేవలం ఏడాది కాలంలో రూ. 1లక్షా 27వేల కోట్ల అప్పులు చేశారని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సోమవారం మెదక్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బడా కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజీలు తీసుకుని డబ్బులిచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదని మండిపడ్డారు.
Similar News
News November 21, 2025
మెదక్: రోడ్డు ప్రమాదాలతో ప్రాణ, ఆర్థిక నష్టం: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణ, ఆర్థిక నష్టం జరుగుతున్న సందర్భంగా రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్లో ఎస్పీ శ్రీనివాస్ రావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలలో గణనీయమైన తగ్గుదల సాధ్యమని పేర్కొన్నారు.
News November 21, 2025
నర్సాపూర్: ‘కుల బహిష్కరణపై ఫిర్యాదు.. పట్టించుకోని ఎస్ఐ’

నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో ఓ వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు.. గ్రామంలో అమ్మవారి గుడి నిర్మాణానికి పెద్దలు నిర్ణయించారు. అయితే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో గోపురం నీడ ఇళ్లపై పడకుండా కొద్ది దూరంలో నిర్మించాలని బాధితుడు చెప్పినందుకు పంచాయతీ పెట్టి, పరువు తీసి,కులబహిష్కరణ చేశారు. పొలంలో వరి కొయ్యనీవకుండా అడ్డుపడ్డారు. నర్సాపూర్ SI, SPకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
News November 21, 2025
మెదక్: డీఈవోగా విజయ బాధ్యతలు

మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఏ.విజయ శుక్రవారం బాధ్యతలు చేయట్టారు. ఏడీగా పనిచేస్తున్న విజయకు పూర్తి బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. SCERT ప్రొఫెసర్ డి.రాధా కిషన్ ఇన్ఛార్జ్ డీఈఓ, డైట్ ప్రిన్సిపల్గా గత 22 నెలలుగా పనిచేసి ఈనెల 11 నుంచి సెలవుపై వెళ్లడంతో ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విజయకు పూర్తి బాధ్యతలు ఇచ్చారు.


