News February 13, 2026
ఒక్క చోటా గెలవని తీన్మార్ మల్లన్న పార్టీ

TG: మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ ఒక్కచోటా గెలవలేకపోయింది. కత్తెర గుర్తుపై TRP అభ్యర్థులు పోటీ చేశారు. తమకు BC వర్గాల మద్దతు ఉంటుందని, కనీసం 40 స్థానాలు గెలుస్తామని మల్లన్న సహా నేతలు ప్రకటించారు. కానీ ఎక్కడా ఆ పార్టీ ప్రభావం కనిపించలేదు. సూర్యాపేటలోని 2 వార్డుల్లో మాత్రమే కొంతమేర ఓట్లు వచ్చాయి. ఇవి మినహా ఇంకెక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు.
Similar News
News March 9, 2026
మహిళలూ HYD వెళ్తున్నారా… అయితే త్వరలో మీకోసం ఓ యాప్

TG: విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి HYDకి వచ్చే మహిళల కోసం ఓ యాప్ను GOVT తెస్తోంది. వారికి వసతి, భద్రత కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందిస్తోంది. యాప్ ద్వారా GOVT, గుర్తింపు పొందిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలోని రూములను ముందుగా బుక్ చేసుకోవచ్చు. హాస్టళ్లలో CCTV కెమెరాలు, సెక్యూరిటీతో పటిష్ఠ ఏర్పాట్లుంటాయి. TNలో అమల్లో ఉన్న ఇలాంటి యాప్ను పరిశీలించిన అధికారులు త్వరలో ఇక్కడా ప్రారంభించనున్నారు.
News March 9, 2026
ICC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇదే

T20WC-2026 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఐసీసీ ప్రకటించింది. 11 మందిలో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది. సౌతాఫ్రికా ప్లేయర్ మార్క్రమ్ను కెప్టెన్గా ప్రకటించింది.
టీమ్: సంజూ శాంసన్, ఫర్హాన్ (పాక్), ఇషాన్ కిషన్, మార్క్రమ్ (C), హార్దిక్ పాండ్య, విల్ జాక్స్, జేసన్ హోల్డర్, బుమ్రా, ఎంగిడి, ఆదిల్ రషీద్, ముజరబానీ (జింబాబ్వే).
*12వ ఆటగాడిగా స్కాల్విక్ (USA)
> జట్టు ఎలా ఉందో COMMENT చేయండి.
News March 9, 2026
చిరంజీవి రాంగ్ టైమ్లో పార్టీ పెట్టారు: శివాజీ

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై నటుడు శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరంజీవి రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఉండాల్సింది. అలా అయితే సీమాంధ్రలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవారు. రాంగ్ టైమ్లో పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల వరకైనా పార్టీని కొనసాగించి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవారేమో’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


