News February 6, 2025

ఒక్క మెసేజ్‌తో స్పందించిన కోనసీమ కలెక్టర్

image

ఐ.పోలవరం మండలం జి.మూలపాలెం జడ్పీ స్కూలుకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి 95 మంది విద్యార్థులు వస్తుంటారు. రోజూ పడవ ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరి అవస్థలను HM జనార్ధనరావు వాట్సాప్ ద్వారా డీఈవో బాషాకు మెసేజ్ చేశారు. విద్యార్థులకు లైఫ్ జాకెట్లు కావాలని కోరారు. కలెక్టర్ మహేశ్ కుమార్‌తో డీఈవో మాట్లాడారు. 3 రోజుల్లోనే 95 మందికి లైఫ్ జాకెట్లు సమకూర్చారు.

Similar News

News February 26, 2026

నస్పూర్: విద్యార్థులకు సులభంగా జీర్ణమయ్యే పౌష్ఠికాహారాన్ని అందించాలి

image

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో సులభంగా జీర్ణమయ్యే పౌష్ఠికాహారాన్ని అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

News February 26, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ భద్రాద్రి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
✓ అశ్వాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
✓ ఇల్లందు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
✓ అశ్వారావుపేట డ్రంక్&డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
✓ టేకులపల్లి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✓ బూర్గంపాడు: ట్రాఫిక్ బూతే ఆమెకు ఇల్లు
✓ డయల్‌ 100కు తక్షణమే స్పందించాలి: భద్రాద్రి ఎస్పీ

News February 26, 2026

మెదక్: రూ.2.71 లక్షల టాక్స్ చెల్లించిన ఆర్టీసీ

image

మెదక్ ఆర్టీసీ డిపోకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ రూ. 2,71,801 చెక్కును డిపో మేనేజర్ సురేఖ బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.