News February 6, 2025

ఒక్క మెసేజ్‌తో స్పందించిన కోనసీమ కలెక్టర్

image

ఐ.పోలవరం మండలం జి.మూలపాలెం జడ్పీ స్కూలుకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి 95 మంది విద్యార్థులు వస్తుంటారు. రోజూ పడవ ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరి అవస్థలను HM జనార్ధనరావు వాట్సాప్ ద్వారా డీఈవో బాషాకు మెసేజ్ చేశారు. విద్యార్థులకు లైఫ్ జాకెట్లు కావాలని కోరారు. కలెక్టర్ మహేశ్ కుమార్‌తో డీఈవో మాట్లాడారు. 3 రోజుల్లోనే 95 మందికి లైఫ్ జాకెట్లు సమకూర్చారు.

Similar News

News November 27, 2025

SRCL: మహిళల ఓట్లపైనే అందరి ఆశలు..!

image

GP ఎన్నికల్లో గెలుపు కోసం CONG, BRS మహిళలపైనే ఆశలు పెట్టుకున్నాయి. జిల్లాలో 170772 మంది పురుషులు, 182559 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11787 అధికంగా ఉన్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, చీరలు, ఫ్రీ RTC ప్రయాణం వంటి పథకాల పేరిట CONG ఓట్లు అడగనుండగా, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు రాబట్టాలని BRS చూస్తోంది.

News November 27, 2025

సిరిసిల్లలో సర్పంచుల ‘ఏకగ్రీవాల పర్వం’..!

image

సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. రుద్రంగి మండలంలోని రూప్లానాయక్ తండా సర్పంచ్‌గా జవహర్‌లాల్ నాయక్‌ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా ఇవాళ ఉదయం అదే మండలంలోని ‘సర్పంచ్ తండా’కు సర్పంచ్(నరహరి నాయక్‌), ఉప సర్పంచ్(గంగారాం నాయక్‌)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, ఈ రెండు తండాల్లో తొలి విడత అయిన DEC 11న ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏకగ్రీవం కావడంతో ఇక ఇక్కడ ఎన్నికలు లేనట్లే.

News November 27, 2025

MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

image

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.