News February 6, 2025
ఒక్క మెసేజ్తో స్పందించిన కోనసీమ కలెక్టర్

ఐ.పోలవరం మండలం జి.మూలపాలెం జడ్పీ స్కూలుకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి 95 మంది విద్యార్థులు వస్తుంటారు. రోజూ పడవ ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరి అవస్థలను HM జనార్ధనరావు వాట్సాప్ ద్వారా డీఈవో బాషాకు మెసేజ్ చేశారు. విద్యార్థులకు లైఫ్ జాకెట్లు కావాలని కోరారు. కలెక్టర్ మహేశ్ కుమార్తో డీఈవో మాట్లాడారు. 3 రోజుల్లోనే 95 మందికి లైఫ్ జాకెట్లు సమకూర్చారు.
Similar News
News December 9, 2025
సంగారెడ్డి: మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జిల్లాలోని 7 మండలాల్లో జరిగే మెదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీసు బందోబస్తు మధ్య డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ తరలించాలని చెప్పారు. సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు.
News December 9, 2025
సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం: CM

TG: నీతి ఆయోగ్, ISB, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజల సూచనలు, సలహాలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 83 పేజీలతో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విజన్ డాక్యుమెంట్ను ఆయన ఆవిష్కరించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ డాక్యుమెంట్ను తీసుకొచ్చామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
News December 9, 2025
తిరుపతి నుంచి ఇంటర్ సిటీ నడపాలి: MLA

తిరుపతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రైళ్లు పెంచాల్సిన అవసరం ఉందని MLA ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి-సాయినగర్ శిర్డీ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. గూడూరు-విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ను తిరుపతి నుంచి నడపాలని కోరారు. అలాగే హైదరాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్ను తిరుపతి వరకు పొడిగించాలని SCR GM శ్రీవాత్సవను కోరారు.


