News December 27, 2024

ఒక సీసీ కెమెరా 20 మంది పోలీసులతో సమానం: ఎస్పీ

image

ఒక సీసీ కెమెరా 20 మంది పోలీసులతో సమానమని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయనగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, జిల్లాలో ఇప్పటికీ 620 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 38 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Similar News

News November 19, 2025

సకాలంలో లక్ష్యాల‌ను సాధించాలి: కలెక్టర్

image

భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 19, 2025

డ్రంకన్ డ్రైవ్‌లో ఇద్దరికి 7 రోజుల జైలు: SP

image

బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు నిందితులకు 7 రోజుల జైలు శిక్ష విధించారు. కొర్లాం గ్రామానికి చెందిన బి.హేమంత్, విజయనగరం పట్టణానికి చెందిన అడపాక సాయిలను నవంబర్ 18న నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కేసును విచారించిన గజపతినగరం మెజిస్ట్రేట్ విజయ్ రాజ్ కుమార్ ఇద్దరికీ జైలు శిక్షను విధించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.

News November 18, 2025

అల్లూరిలో ఎన్‌కౌంటర్.. భద్రత చర్యలు కట్టుదిట్టం: VZM ఎస్పీ

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో, విజయనగరం జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై కూడా నిఘా పెట్టినట్లు వెల్లడించారు.