News November 30, 2024
ఒడిశాపై పాండిచ్చేరి గెలుపు

విశాఖపట్నం లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్లో శుక్రవారం ఒడిస్సా, పాండిచ్చేరి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వాతావరణం సహకరించకపోవడం వలన 20 ఓవర్ల మ్యాచ్ను 6 ఓవర్లకు కుదించారు. దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన పాండిచ్చేరి 6 ఓవర్లలో 91/2 చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఒడిశా 6 ఓవర్లలో 75/3 పరుగులు చేసింది. 35 పరుగులు చేసిన కె.బి.అరుణ్ కార్తీక్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్గా నిలిచాడు.
Similar News
News January 8, 2026
విశాఖలో రేపటి నుంచి లైట్ హౌస్ ఫెస్టివల్

విశాఖలోని రేపటి నుంచి రెండు రోజులు పాటు లైట్ హౌస్ ఫెస్టివల్ పేరిట కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ వెల్లడించారు. ఎంజీఎం పార్కు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ ఫెస్టివల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.
News January 8, 2026
విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
News January 8, 2026
విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.


