News January 4, 2025
ఒడిశా గవర్నర్గా ప్రకాశం జిల్లా వాసి

ఒడిశా గవర్నర్గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లా వాసే. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం ఈయన స్వగ్రామం. మిజోరం గవర్నర్గా ఉన్న ఈయనను ఒడిశాకు బదిలీ చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్భవన్లో హరిబాబుతో శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా CMమోహన్ చరణ్ మాఝీ హాజరయ్యారు. ఆయన ఉన్నత చదువుల కోసం వైజాగ్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.
Similar News
News September 18, 2025
ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News September 17, 2025
ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.
News September 17, 2025
ఒంగోలులో పిడుగుపాటు.. పదేళ్ల బాలుడి మృతి.!

ఒంగోలులో పిడుగుపాటుకు గురై పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు శివారు ప్రాంతంలో పదేళ్ల బాలుడు ఇంటి వద్ద ఉన్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడినట్లు సమాచారం. దీంతో బాలుడు మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడు కంకణాల చందుగా తెలుస్తోంది.