News February 3, 2025

ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 9, 2026

వివాదాస్పద బుక్.. లీకేజీపై దర్యాప్తు

image

లోక్‌సభలో <<19052501>>ప్రకంపనలు<<>> రేపిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె ఆత్మకథ పుస్తకం ఎలా లీకైందనేదానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. FIR నమోదు చేసి PDF కాపీ ఎలా బయటికి వచ్చిందని ఆరా తీస్తున్నారు. చైనాతో ఉద్రిక్తతలకు సంబంధించి నిజాలు ఇందులో రాశారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ పుస్తకం ఎప్పటికీ పబ్లిష్ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెబుతున్నారు. కేంద్ర ఆమోదం లభించకపోవడంతో ఈ పుస్తకం పబ్లిషింగ్ నిలిచిపోయింది.

News February 9, 2026

బంజారాహిల్స్‌లో నిలోఫర్ కొత్త వెజ్ హబ్ ప్రారంభం

image

హైదరాబాద్‌లో విశ్వసనీయ ఆహార బ్రాండ్ నిలోఫర్ బంజారాహిల్స్‌లో తన కొత్త రూఫ్‌టాప్ వెజిటేరియన్ రెస్టారెంట్ Niloufer Chathను ప్రారంభించింది. నార్త్ ఇండియన్ వెజ్ రుచులు, ఆధునిక డిజైన్, ప్రీమియం అంబియెన్స్‌తో ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. నాణ్యత, నమ్మకమే తమ లక్ష్యమని ఛైర్మన్ అనుముల బాబు రావు, MD శశాంక్ తెలిపారు. MLA దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని ప్రశంసించారు.

News February 9, 2026

బంజారాహిల్స్‌లో నిలోఫర్ కొత్త వెజ్ హబ్ ప్రారంభం

image

హైదరాబాద్‌లో విశ్వసనీయ ఆహార బ్రాండ్ నిలోఫర్ బంజారాహిల్స్‌లో తన కొత్త రూఫ్‌టాప్ వెజిటేరియన్ రెస్టారెంట్ Niloufer Chathను ప్రారంభించింది. నార్త్ ఇండియన్ వెజ్ రుచులు, ఆధునిక డిజైన్, ప్రీమియం అంబియెన్స్‌తో ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. నాణ్యత, నమ్మకమే తమ లక్ష్యమని ఛైర్మన్ అనుముల బాబు రావు, MD శశాంక్ తెలిపారు. MLA దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని ప్రశంసించారు.