News February 3, 2025

ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

image

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించక కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.

News February 4, 2025

ఆదిలాబాద్: MALE నిరుద్యోగులకు GOOD NEWS

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్‌లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, మెకానికల్ డిప్లమా పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు. SHARE IT.

News February 4, 2025

ADB జిల్లా వాసికి ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డ్

image

క్యాన్సర్ వ్యాధి నివారణకు 10 ఏళ్లుగా కృషి చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసి డాక్టర్ ఉమాకాంత్ గౌడ్ ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ప్రొఫెసర్లు అవార్డుకు ఎంపిక కాగా.. అందులో ADBలోని శాంతి నగర్‌కు చెందిన ఉమాకాంత్ గౌడ్ ఉన్నారు. ఈనెల 4న కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ‌లో అవార్డు అందుకోనున్నారు.