News February 3, 2025

ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 15, 2025

సిరి సంపదలకు పునాది ‘వాస్తు’

image

వాస్తు బాగున్న ఇంట్లో నివసిస్తే వారికి సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘మంచి వాస్తు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభావవంతమైన ఆలోచనలు వస్తాయి. అవి అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. దీంతో మన జీవితంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పడతాయి. ఇవే అంతిమంగా మనకు ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తాయి. వాస్తే మన సౌభాగ్యానికి తొలి మెట్టు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News October 15, 2025

నల్లమలలో ఆయుర్వేదిక్ కళాశాల ఏర్పాటు

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని హాజీపూర్ గ్రామ శివారులో ఆయుర్వేదిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఈ రోజు అధికారులతో కలిసి కళాశాల ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నల్లమల వాసుల చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు. కళాశాల ఏర్పాటుకు సహకారం అందించిన సీఎం, వైద్య మంత్రి, పర్యాటక మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

News October 15, 2025

MBNR: యూనివర్సిటీని పరిశీలించిన ఎస్పీ

image

పాలమూరు యూనివర్సిటీలో లైబ్రరీ ఆడిటోరియంలో రేపు 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరు అవుతున్నందున జిల్లా ఎస్పీ డి.జానకి యూనివర్సిటీని ఈరోజు సందర్శించి సమావేశమయ్యే భవనాన్ని పరిశీలించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో క్యాంపస్ అంతర్గత రోడ్డు మార్గం, వెహికల్ పార్కింగ్ మొదలైన విషయాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేశ్ బాబు, కంట్రోలర్ డా.కె.ప్రవీణ, డా.కుమారస్వామి ఉన్నారు.