News February 3, 2025

ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 19, 2025

జగిత్యాల జిల్లాలో నేటి CRIME NEWS!

image

@మెట్పల్లి ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలంటూ కోరుట్లలోని కాంగ్రెస్ నేతల డిమాండ్ @మల్యాలలో కోతుల దాడి.. వ్యక్తికి గాయాలు @కొడిమ్యాలలో దారి తప్పిన చుక్కల దుప్పి @భీమారంలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన @రేపు మల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఇసుక బహిరంగ వేలం @ఇబ్రహీంపట్నంలో చోరికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు @జగిత్యాల ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించిన ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశ్

News February 19, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS!

image

@జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం @రాష్ట్రస్థాయి పోటిల్లో జగిత్యాల బిడ్డల సత్తా @కలెక్టర్‌తో సీఎస్ వీడియో సమావేశం @గొల్లపల్లి విద్యార్థికి అథ్లెటిక్స్‌ సిల్వర్ మెడల్ @కథలాపూర్‌లో జిల్లా వైద్యాధికారి తనిఖీలు @మల్లాపూర్‌లో పర్యటించిన DRDO PD@కొండగట్టులో భక్తుల రద్దీ @జగిత్యాలలో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం @కోరుట్ల మల్లన్న జాతరలో పాల్గొన్న MLA సంజయ్

News February 19, 2025

శ్రీలత రెడ్డికి సూర్యాపేట బీజేపీ పగ్గాలు!

image

BJP జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతరెడ్డిని రాష్ట్ర పార్టీ నియమించింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా ఆమె పేరును మంగళవారం ప్రకటించింది. నేరేడుచర్లకు చెందిన శ్రీలతరెడ్డి 2023లో BRS నుంచి BJPలో చేరి హుజుర్‌నగర్ BJP అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పటికే NLG జిల్లా BJP అధ్యక్షుడిగా వర్షిత్‌రెడ్డి, యాదాద్రిభువనగిరి అధ్యక్షుడిగా అశోక్ గౌడ్‌‌ని పార్టీ నియమించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!