News July 26, 2024
ఒలింపిక్స్లో విశాఖ క్రీడా ‘జ్యోతి’

సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డురాదని యర్రాజీ జ్యోతి నిరూపించారు. పేదరికాన్ని పక్కకు నెట్టి పారిస్ ఒలింపిక్స్లో 100మీ హర్డిల్స్లో పోటీ పడుతున్న తొలి భారత అథ్లెట్గా రికార్డు సృష్టించారు. 100 మీ. హర్డిల్స్లో దేశంలోనే ఫాస్టెస్ట్ ఉమెన్ అథ్లెట్గా గుర్తింపు సాధించారు. 40 ఏళ్ల తర్వాత విశాఖ నుంచి ఒలింపిక్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మన జ్యోతి.. ‘స్వర్ణ జ్యోతి’గా తిరిగి రావాలని ఆశిద్దాం.
Similar News
News November 17, 2025
బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్కు మత్స్యకారులు కోరారు.
News November 17, 2025
బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్కు మత్స్యకారులు కోరారు.
News November 16, 2025
వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: ప్రణవ్

సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పెద్దఎత్తున ఒప్పందాలు జరగటంతో వైసీపీ నేతలు భయపడి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డు మంత్రిగా పేరొందిన అమర్ నాథ్ ఉన్న ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.


