News November 14, 2024
ఓంకారం: ఆకలి తీర్చేందుకు వెళ్లి అనంత లోకాలకు

ఓంకారం వద్ద ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు భక్తుల ఆకలి తీర్చేందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏ కోడూరుకు చెందిన మాజీ సర్పంచ్ చెన్నారెడ్డి, బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అన్నదానం నిమిత్తం బియ్యం, సామాగ్రిని ఆలయం వద్ద దించి వస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఇద్దరు మృతి చెందగా, చిన్నన్న, శేషన్న గాయపడ్డారని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.
Similar News
News December 3, 2025
అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కోడుమూరు మండలం గోరంట్లలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం తనిఖీ చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులతో కలిసి గర్భిణులకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్, పాలు, గుడ్లు, బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విషయంలో శుభ్రతను పాటించాలని ఆదేశించారు.
News December 3, 2025
డ్రైవింగ్లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News December 3, 2025
డ్రైవింగ్లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


