News July 15, 2024
ఓటమి తర్వాత ఒంగోలుకు బాలినేని

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి బాలనేని ఓటమి తర్వాత ఇవాళ ఒంగోలుకు వస్తున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని పలు మార్లు ప్రచారంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయంపై నియోజకవర్గం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ జయంతిన చాలా మంది కార్పొరేటర్లు దూరంగా ఉండటం కూడా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 27, 2025
ప్రకాశం: ఫ్రీ ట్రైనింగ్తో జాబ్.. డోంట్ మిస్.!

ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ బాలికల కళాశాలలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 3 నెలలు ఉచిత శిక్షణ అందిస్తామని, ఆ తర్వాత ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 28లోగా కళాశాలను సంప్రదించాలన్నారు.
News November 27, 2025
ఉపాధ్యాయుడిపై విచారణకు త్రి మెన్ కమిటీ నియామకం

నాగులుప్పలపాడు మండలం బి నిడమనూరు కళాశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు వినయ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో త్రి మెన్ విచారణ కమిటీని నియమించినట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగా గ్రామస్థులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
News November 27, 2025
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DEO

DEO కిరణ్ కుమార్ బుధవారం కొండేపి మండలంలోని ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రణాళికతో స్టడీ అవర్స్ నిర్వహించాన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.


