News March 6, 2025
ఓటమి మరింత బాధ్యతను పెంచింది: నరేందర్ రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తనదేనని, పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News November 4, 2025
గ్రంథాలయాలు అభివృద్ధి చేయాలని కలెక్టర్కు ఛైర్మన్ వినతి

భద్రాద్రి జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని గ్రంథాలయ ఛైర్మన్ వీరబాబు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ను కోరారు. జిల్లా గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు, పలు గ్రంథాలయాల అభివృద్ధికి స్థల సేకరణ అవసరం ఉందన్నారు. గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు సహాయం చేయాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
News November 4, 2025
వచ్చేనెలలో పుస్తకాల పండుగ.. నగరం సిద్ధమా?

HYDలో బుక్ ఫెయిర్.. ఈ పేరు వింటే చాలు పుస్తక ప్రేమికులు పులకించిపోతారు. ఏటా నగరంలో జరిగే ఈ వేడుక కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది ఈ ఫెస్టివల్ వచ్చేనెలలో జరగబోతోంది. ఎన్టీఆర్ స్టేడియంలో DEC 19 నుంచి 10 రోజుల పాటు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కేవలం పుస్తక విక్రయాలే కాకుండా సాహితీ చర్చలు, పుస్తక ఆవిష్కరణలు ఉంటాయని బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు యాకూబ్, శ్రీనివాస్ తెలిపారు.
News November 4, 2025
WWC టీమ్ను ప్రకటించిన ఐసీసీ.. కెప్టెన్ ఎవరంటే?

మహిళల ప్రపంచ కప్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నీని ICC ప్రకటించింది. విజేతగా నిలిచిన భారత్ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు చొప్పున, పాక్, ఇంగ్లండ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. టీమ్: స్మృతి మంధాన, లారా(కెప్టెన్), జెమీమా, కాప్, గార్డ్నర్, దీప్తి శర్మ, సదర్లాండ్, డి క్లెర్క్, నవాజ్, అలానా కింగ్, ఎక్లిస్టోన్, బ్రంట్ (12వ ప్లేయర్). మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.


