News September 14, 2024

ఓటరు జాబితా సవరణకు ఈనెల 21 వరకు అవకాశం: డిపిఓ

image

ఓటర్ జాబితాలో పేరు సవరణకు ఈనెల 21 వరకు అవకాశం కల్పించినట్లు వనపర్తి జిల్లా డిపిఓ సురేష్ కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేపథ్యంలో ఆయన శుక్రవారం అమరచింత ఎంపీడీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ఈనెల 19 వరకు ఓటర్లు తమ పేర్లను సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనెల 19న అఖిలపక్ష పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి 28న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.

Similar News

News December 2, 2025

MBNR: సైబర్ నేరాలకు పాల్పడితే..1930కు ఫోన్ చేయండి

image

సైబర్ నేరాలకు బారిన పడినప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘Fraud Ku Full Stop’ అనే నినాదంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ ప్రతిజ్ఞ చేశారు. సైబర్ నేరాలు రోజు రోజుకూ రూపం మార్చుకుంటున్నాయి. ఒక్క క్లిక్‌తో పెద్ద నష్టం చోటుచేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలన్నారు.

News December 2, 2025

మహబూబ్‌నగర్: జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్ల నుంచి జిల్లా ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.

News December 2, 2025

పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

image

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.