News April 18, 2024

ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కారం

image

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.

Similar News

News October 14, 2025

MROపై దౌర్జన్యం.. పోలీసులకు ఫిర్యాదు

image

లింగసముద్రంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సోమవారం తాగిన స్థితిలో ఉన్న ఆయన డ్యూటీలో ఉన్న తహశీల్దార్‌పై ఆయన ఛాంబర్‌లోనే దౌర్జన్యానికి తెగబడి, నానా మాటలు అన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తనపై దౌర్జన్యం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహశీల్దార్ కోటేశ్వరరావు తెలిపారు.

News October 13, 2025

విచారణ జరిపి న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

image

చట్ట ప్రకారం విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేస్తామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల తెలిపారు. నెల్లూరు పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు 125 ఫిర్యాదులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి అర్జీలను పరిష్కరించాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు.

News October 13, 2025

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో మాజీ MLA అనుచరుడి మృతి

image

మాజీ MLA కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు పాలవెల్లి పద్మనాభరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జాతీయ రహదారిపై ముంగమూరు వద్ద బైక్‌పై వస్తుండగా కారు ఢీకొట్టింది. నెల్లూరులోని ఓ హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అల్లూరులో కాటంరెడ్డి అభిమానులతో కలిసి కావలికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో కాటంరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.