News January 24, 2025
ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరో వైపు ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఉదయం 9 గంటలకు మానవహారం ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి రంగనాథ్ తెలిపారు.
Similar News
News November 28, 2025
WPL-2026కు ఆదోని క్రికెటర్ దూరం

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహిళా క్రికెటర్ అంజలి శర్వాణి, మోకాలి సర్జరీ కారణంగా WPL-2026 సీజన్కు దూరమయ్యారు. గత మూడు సీజన్లలో యూపీ వారియర్స్కు ప్రాతినిథ్యం వహించిన శర్వాణి, గాయాలతో 8 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు ఆమె తండ్రి రమణారావు Way2Newsతో చెప్పారు. వచ్చే జనవరి నుంచి ఆంధ్ర జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు.
News November 28, 2025
KNR: గంపగుత్తగా వేస్తే.. ‘గుడి కట్టిస్తాం.. బాసాన్లు ఇస్తాం’

సర్పంచ్ ఎన్నికల్లో కుల సంఘాల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి ఆశావహులు వింత పోకడలకు వెళ్తున్నారు. సంఘం ఓట్లన్నీ ఒకవైపే వేస్తే కులదేవతకు దేవాలయం, టెంట్ హౌస్ సామగ్రి, వంట పాత్రలు వంటివి ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని కుల సంఘాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కులపెద్దలు COSTLY డిమాండ్లను ఆశావహుల ముందు పెడుతున్నారు. కాగా ఉమ్మడి KNRలో మొదటి విడతలో 398 GPలకు ఎన్నికల జరగనున్నాయి.
News November 28, 2025
మన ఆత్మలోనే వేంకటేశ్వరుడు

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవ చ||
విష్ణుమూర్తి ఆత్మ స్వరూపుడు. ముక్తి పొందిన జీవులకు శాశ్వత గమ్యం ఆయనే. ఆ దేవుడు ప్రతి శరీరంలో ఉంటాడు. లోపల జరిగే ప్రతి విషయాన్ని సాక్షిగా చూస్తుంటాడు. కానీ, మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ఆ దేవుడు బయటెక్కడో లేడు, మన అంతరాత్మలోనే ఉన్నాడని ఈ శ్లోకం వివరిస్తోంది. ఆయనే మోక్షాన్ని ఇస్తాడని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


