News February 18, 2026
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి బిఎల్ఓలను ఆదేశించారు. బుధవారం భీమవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల నమోదు, మార్పుల క్లైమ్ల పరిష్కారంపై సమీక్షించారు. ముఖ్యంగా యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News March 17, 2026
అలర్ట్.. ప.గో. జిల్లాలో ఉద్యోగాలు

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తణుకులో నూతనంగా ‘వన్ స్టాప్ సెంటర్’ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అధికారిణి డి.శ్రీలక్ష్మి తెలిపారు. ఇందులో అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, కౌన్సెలర్, కంప్యూటర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు westgodavari.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 17, 2026
రెవెన్యూ క్లినిక్లతో భూసమస్యల పరిష్కారం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు ఉత్తమ ఫలితాలు నిస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ..29 డిసెంబర్, 2025న రెవెన్యూ క్లినిక్లు ప్రారంభం నాటి నుంచి మార్చి 16, 2026 వరకు 10 విడతలుగా రెవెన్యూ క్లినిక్లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 461 దరఖాస్తులు అందగా 148 పరిష్కరించామన్నారు.
News March 17, 2026
ప్రభుత్వ ఆదాయం పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడంలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. మంగళవారం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జీఎస్టీ సమన్వయ సమావేశం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖ, ఇతర ఆదాయార్జన శాఖల అధికారులు పాల్గొన్న ఈ సభలో.. పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఆదాయ వనరులను మెరుగుపరిచేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.


