News May 11, 2024
ఓటింగ్ క్రతువును వీక్షించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు

పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ క్రతువును వీక్షించేందుకు సంబంధిత కలెక్టరేట్లలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు కలెక్టర్, ఇతర ఎన్నికల సిబ్బంది పర్యవేక్షించటానికి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, తనిఖీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన నిఘానేత్రాల ద్వారా అక్కడి తంతును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News November 22, 2025
ఖమ్మం: గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26కి 5 నుంచి 9వ తరగతులల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అర్హులైన వారు నవంబర్ 25 సాయంత్రం 5 వరకు ఖమ్మం అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. వీటీజీ/బీఎల్వీ సెట్ రాసిన వారికి ప్రాధాన్యత, ఇతరులకు లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు.
News November 22, 2025
ఖమ్మం: మారుతి ఆగ్రోటెక్ ఉద్యోగాల కోసం జాబ్ మేళా

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం శనివారం ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. మారుతి ఆగ్రోటెక్ అండ్ ఫర్టిలైజర్స్ (HYD) కంపెనీలోని మార్కెటింగ్ సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎస్సెస్సీ లేదా డిగ్రీ అర్హతతో 20-40 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని, వేతనం రూ.20,000– 30,000 ఉంటుందని ఆయన తెలిపారు.
News November 22, 2025
ఖమ్మం: మారుతి ఆగ్రోటెక్ ఉద్యోగాల కోసం జాబ్ మేళా

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం శనివారం ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. మారుతి ఆగ్రోటెక్ అండ్ ఫర్టిలైజర్స్ (HYD) కంపెనీలోని మార్కెటింగ్ సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎస్సెస్సీ లేదా డిగ్రీ అర్హతతో 20-40 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని, వేతనం రూ.20,000– 30,000 ఉంటుందని ఆయన తెలిపారు.


