News May 11, 2024
ఓటింగ్ క్రతువును వీక్షించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు

పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ క్రతువును వీక్షించేందుకు సంబంధిత కలెక్టరేట్లలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు కలెక్టర్, ఇతర ఎన్నికల సిబ్బంది పర్యవేక్షించటానికి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, తనిఖీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన నిఘానేత్రాల ద్వారా అక్కడి తంతును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News October 22, 2025
ఖమ్మం: తపాల శాఖ ఏజెంట్లకు.. దరఖాస్తుల ఆహ్వానం

తపాలా శాఖ బీమా పథకాలు పోస్టల్ జీవిత బీమా పీఎల్ గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్పీఎస్ఐ) లకు సంబంధించి కమీషన్ పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లు చేసి, 18 ఏళ్ల వయస్సు నిండిన నిరుద్యోగులు, గృహిణులు అంగన్వాడీ సేవకులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అర్హులని, ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 22, 2025
ఖమ్మం: రెండు పదవులకు 66 మంది పోటీ

ఖమ్మం కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్ష పదవుల ఎంపికపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డీసీసీకి 56, నగర కమిటీకి 10 మంది దరఖాస్తు చేసుకోగా, ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ ఆరుగురి పేర్లను షార్ట్లిస్ట్ చేసినట్లు సమాచారం. ఐదేళ్లుగా కాంగ్రెస్కు విధేయులుగా ఉన్నవారికే పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యనేతల బంధువులు అర్హులు కాదన్న నిబంధనతో వడపోత పూర్తయి, నవంబర్ 15న తుది జాబితా వెలువడనుంది.
News October 22, 2025
ఖమ్మం DCC పీఠం కమ్మ సామాజిక వర్గానికేనా..?

ఖమ్మం DCC అధ్యక్ష పీఠం కోసం అంతర్గత రాజకీయం రగులుతుంది. Dy.CM భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. భట్టి వర్గం నుంచి వేమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నూతి సత్యనారాయణ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. భట్టి వ్యూహాత్మకంగా కమ్మ వర్గం అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచినట్లు సమాచారం. స్థానికత, సామాజిక సమీకరణలపై ఆధారపడి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.