News May 11, 2024

ఓటుకు నోటు.. ఒంగోలులో రూ.3 వేలు.?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటితో ప్రచార పర్వం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఒంగోలు, దర్శి నియోజకవర్గాల్లో రూ.3వేలు ఇస్తున్నట్లు సమాచారం. గిద్దలూరు, మార్కాపురం, చీరాల, అద్దంకి 2000 ఇస్తున్నారట. కాగా కొండపి, కనిగిరి, వై.పాలెంలో ఓటుకు 1500-2000 ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అటు ఇలాంటివి కట్టడి చేసేందుకు ఈసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

Similar News

News February 7, 2025

కేంద్రమంత్రితో మంత్రి స్వామి భేటీ

image

ఢిల్లీలోని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌తో శుక్రవారం మంత్రి స్వామి భేటి అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించారు. PM AJAY ఆదర్శ గ్రామ్ స్కీం కింద, రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.110 కోట్లు విడుదల చేయాలన్నారు. 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి రూ.245 కోట్లు విడుదల చేయాలని కోరారు.

News February 7, 2025

చీమకుర్తి: ‘న్యాయం జరిగే వరకు నా శవాన్ని తీయొద్దు’

image

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లెటర్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ‘నా చావుకు నా భార్య కుటుంబం. వాళ్లను వదిలిపెట్టొద్దు. నాకు న్యాయం జరిగేవరకు నా శవం కుళ్లినా తీయకండి. నాకు 10 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. మెదటి రాత్రి తర్వాతి నుంచి నా భార్యతో గొడవలు జరుగుతున్నాయి.’ అని లెటర్లో పేర్కొన్నాడు.

News February 7, 2025

చీమకుర్తి: 6 పేజీల సూసైన్ నోట్‌తో మృతి

image

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోనికి వెళ్తే.. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకి కారణం అయ్యుండొచ్చని స్థానికులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు శీను రాసిన ఆరు పేజీల లేఖను తన జేబులో గుర్తించారు. ‘నా ఇద్దరు పిల్లలు జాగ్రత్త’ అంటూ తాను రాసిన లేక గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

error: Content is protected !!