News May 11, 2024

ఓటు కోసం సొంత రాష్ట్రానికి పోటెత్తారు

image

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. మూడు రోజులు వరుస సెలవులు రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి బయల్దేరారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవే రద్దీగా మారింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఏపీలో ఓటు ఉండి తెలంగాణలో నివసిస్తున్న వారు 30 లక్షల వరకు ఉంటారని అంచనా. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 18 లక్షల మంది ఉన్నట్లు సమాచారం.

Similar News

News November 18, 2025

అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

image

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్‌ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్‌కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.

News November 18, 2025

అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

image

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్‌ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్‌కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.

News November 18, 2025

ఇవాళ భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు APSDMA తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. మరోవైపు ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.