News May 11, 2024

ఓటు కోసం సొంత రాష్ట్రానికి పోటెత్తారు

image

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. మూడు రోజులు వరుస సెలవులు రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి బయల్దేరారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవే రద్దీగా మారింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఏపీలో ఓటు ఉండి తెలంగాణలో నివసిస్తున్న వారు 30 లక్షల వరకు ఉంటారని అంచనా. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 18 లక్షల మంది ఉన్నట్లు సమాచారం.

Similar News

News November 26, 2025

ఇండోనేషియాలో తుఫాన్ బీభత్సం.. 8 మంది మృతి

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సెన్‌యార్’ తుఫాన్ ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో బీభత్సం సృష్టిస్తోంది. అతిభారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 8 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇవాళ రాత్రికి తుఫాన్ తీరం దాటనున్నట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు భారత్‌లోని తమిళనాడు, కేరళ, అండమాన్ & నికోబార్‌పై సెన్‌యార్ ప్రభావం చూపుతోంది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

News November 26, 2025

పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారు?

image

శుభకార్యాలు ప్రారంభించే ముందు పెరుగు, చక్కెర కలిపి తింటారు. ఇలా తింటే అదృష్టం వరిస్తుందన్న నమ్ముతారు. అయితే దీని వెనుక ఓ ఆరోగ్య రహస్యం ఉంది. ఇంటర్వ్యూ, పెళ్లి చూపులు, ఫస్ట్ డే ఆఫీస్‌కు వెళ్లినప్పుడు ఎవరికైనా ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. అయితే పెరుగుకు దేహాన్ని చల్లబరచే సామర్థ్యం, చక్కెరకు తక్షణ శక్తి అందించే లక్షణాలు ఉంటాయి. ఈ మిశ్రమం తీసుకుంటే టెన్షన్‌ తగ్గి, మనసు శాంతిస్తుంది. అందుకే తినమంటారు.

News November 26, 2025

ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

ఏపీ గ్రామీణ బ్యాంకులో 7 ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 35 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.23,500, సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్‌కు రూ.30వేల చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://apgb.bank.in/